నేతన్నలకు ఏటా రూ.25,000 ఆర్థిక సాయం.. ఆగస్టు 7న కొత్త పథకానికి శ్రీకారం!

-

రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమం మరియు వారి ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7న ‘నేతన్నకు భరోసా’ అనే నూతన పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. నేతన్నల కష్టాలను గుర్తించి, వారి మగ్గాల సప్పుడు ఆగకుండా చూసేందుకు ఈ ఆర్థిక భరోసాను అందిస్తోంది. అసలు ఈ పథకం ద్వారా ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది, బడ్జెట్ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

రూ.25,000 ఆర్థిక సాయం: ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25,000 ఆర్థిక సాయం నేరుగా అందుతుంది. ఇక చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు పెట్టుబడి సాయంగా, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి ఈ సొమ్ము ఎంతగానో ఉపయోగపడనుంది.

54 వేల మందికి లబ్ధి: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 54,000 మందికి పైగా అర్హులైన చేనేత కార్మికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇక ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్‌లో ఏకంగా రూ.250 కోట్లు కేటాయించడం విశేషం. దీనివల్ల వేలాది చేనేత కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి.

₹25,000 Annual Financial Aid for Weavers: New Scheme to Launch on August 7
₹25,000 Annual Financial Aid for Weavers: New Scheme to Launch on August 7

అనుబంధ రంగాలకూ ఊరట: కేవలం మగ్గం ఉన్న చేనేత కార్మికులే కాకుండా.. నూలు చుట్టడం, రంగులద్దడం (డైయింగ్) వంటి చేనేత అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను కూడా ఈ పథకంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇక దీనివల్ల మరింత మందికి మేలు జరుగుతుంది.

ఆగస్టు 7న శుభారంభం: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ఈ పథకానికి ప్రభుత్వం అధికారికంగా శ్రీకారం చుట్టనుంది. ఇక లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ అయ్యేలా పారదర్శకంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

ఇక మగ్గాన్ని నమ్ముకుని జీవిస్తున్న నేతన్నలకు ‘నేతన్నకు భరోసా’ పథకం నిజంగానే పెద్ద కొండంత అండ. ఏటా లభించే రూ.25,000 ఆర్థిక సాయం వారి ఆర్థిక ఇబ్బందులను తీర్చి, చేనేత రంగానికి కొత్త ఊపిరి పోస్తుదనడంలో సందేహం లేదు!

గమనిక: ఇది ప్రభుత్వం ప్రకటించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా అందించిన కథనం. పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు మరియు దరఖాస్తు విధానాన్ని ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news