అయోధ్య రామాలయాన్ని సందర్శించిన పవన్ ఎమోషనల్…..

-

ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు వైభవంగా జరిగింది.ఈరోజు ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం 12:38 గంటలకు అభిజిత్ లగ్నంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయినారు .అంతేకాకుండా దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా బాల రాముని సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్  కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. “ఈ రోజు నాకు చాలా భావోద్వేగంగా ఉంది అని  ప్రాణ ప్రతిష్ఠ సమయంలో నా కళ్ళ నుంచి కన్నీళ్లు కారాయి.

 

అద్భుతమైన శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం భారతదేశాన్ని ఒకే జాతిగా బలోపేతం చేసింది. శ్రీరామచంద్రుడు ధర్మం, త్యాగం, సహనం, ధైర్యసాహసాలకు ప్రతిరూపంగా నిలిచి అందరికీ స్పూర్తిదాయకంగా అయినారు. శ్రీరాముని మార్గంలోనే ఇండియా అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయోధ్య రామాలయ నిర్మాణంలో మనందరం పాల్పంచుకోవడం సమీష్టి బాధ్యత” అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news