అలంపూర్ జోగులాంబ ఆశీస్సులతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం షురూ..

-

తెలంగాణలో తెరాస అధినేత ఎన్నికల ప్రచారాన్ని రాకేట్ వేగంతో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న నిజామాబాద్ సభ ద్వారా తెరాస కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి సాక్షిగా ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. కార్యక్రమంలో  భట్టి విక్రమార్క, జానారెడ్డి, కుంతియా, షబ్బీర్ అలీ, రేవంత్, పొన్నం ప్రభాకర్, విజయ శాంతి, డీకే అరుణ, సంపత్ కుమార్‌ పాల్గొన్నారు. మహాకూటమిగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రచారం ప్రారంభించడంతో స్థానిక నేతల్లో ఉత్సాహం పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news