ఆంబోతులకు ఆవులను సప్లయి చేసి ఎదిగిన వ్యక్తి చంద్రబాబు.. అంబటి సంచలన వ్యాఖ్యలు….

-

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు ఆంబోతులకు ఆవులను సప్లయి చేసి ఎదిగిన వ్యక్తి అని అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు రా కదలిరా అంటే వచ్చే వారు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు.

అధికారం కోసం ఏ గడ్డైనా కరిచే వ్యక్తి చంద్రబాబు అని, లోకేష్‌కు, చంద్రబాబుకు ప్రజాదరణ ఏమాత్రం లేదు’ అని అంబటి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్లో చంద్రబాబును ఎవరు నమ్మే పరిస్థితి లేదన్న ఆయన.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోకేష్‌, పవన్‌తో హైదరాబాద్‌కు పోవాల్సిందేనని అంబటి రాంబాబు ఎద్దేవ చేశారు. పవన్‌ కళ్యాణ్‌కు అధికారికంగా, అనధికారికంగా పొత్తులు పెట్టుకోవడం అలవాటేనని అన్నారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని, చంద్రబాబు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేడని అంబటి అన్నారు.ఇచ్చినమాట నిలబెట్టుకున్న ప్రభుత్వం వైయస్ జగన్ ప్రభుత్వానిది అని, ఎంతమంది కలిసి వచ్చినా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్‌ను ఓడించలేరంటూ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కుప్పంలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తామన్న చంద్రబాబు.. ఇన్నాళ్లు ఎందుకు పట్టించుకోలేదని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news