Purandeshwari: బీసీ ని ప్రధానిని చేయడం బీజేపీతోనే సాధ్యపడింది..

-

విశాఖలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీసీ సామాజిక చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, సత్యకుమార్,సీఎం రమేష్,దగ్గుబాటి పురంధేశ్వరి, హాజరయ్యారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అని , బీసీ కమిషన్ కు ఎందుకు చట్టబద్ధత కల్పించలేకపోయిందని ఆమె ఆరోపించింది. బీసీ కులాలు అనే నైతికత జగన్ కు ఎక్కడ ఉందని పురందేశ్వరి అన్నారు.

దేశనికి బీసీని ప్రధానిని చేయడం బీజేపీతోనే సాధ్యపడిందని పురంధేశ్వరీ అన్నారు. అట్టడుగు వర్గాల సేవకు బీజేపీ అంకితం అయ్యిందని , బీసీ కమిషన్ కు చట్ట బద్దత కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని పురంధేశ్వరీ ప్రశంసించింది. రాజు అనే వాడు ప్రజాభీష్టానికి అనుగుణంగా పని చేయాలే కానీ తనకు అనుకూలంగా పనిచేయకూడదు అని పురంధేశ్వరీ అన్నారు.మరోవైపు వై. సత్యకుమార్ మాట్లాడుతూ.. రెండోసారి ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావాలంటే తలకిందులుగా తపస్సు చేయాలిసిందేనని అన్నారు. బూటకపు మాటలు చెప్పిన పార్టీలను ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news