ఆపరేషన్ గరుడ సూత్రధారి చంద్రబాబే…వైవీ సుబ్బారెడ్డి

-

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దాడి సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఆపరేషన్ గరుడ సూత్ర ధారి చంద్రబాబే అంటూ విమర్శించారు. జగన్ పై దాడి కేసులో ఏ1 గా చంద్రబాబు, ఏ2గా డీజీపీని పేర్కొంటూ ఈ రోజు హైకోర్టులో కేసు వేస్తామన్నారు. నిందితుడు వద్ద దొరికిన లేఖను వెంటనే విడుదల చేయకుండా ..సాయంత్రం డ్రామాను రక్తీకట్టించే విధంగా సీఎం చంద్రబాబు మీడియాకు విడుదల చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. కనీసం మానవత్వం కూడ మరిచి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news