ఆరు గ్యారంటీలలో యువతకు మొండి చేయి : ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

-

ఇటీవల ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నింటిని అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని సారంగాపూర్ మండలంలో పలు అభివృద్ధి ,సంక్షేమ పథకాల కార్యక్రమాల్లో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఆరు గ్యారంటీలలో మొండి చేయి చూపిందని ఆరోపించారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పథకం ప్రకారం యువ వికాస పథకాన్ని ప్రజాపాలనలో ఎందుకు అమలు చేయడం లేదో తెలుపాలని ప్రశ్నించారు. దరఖాస్తు లు లేకుండా సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు.

ప్రోటోకాల్ విషయంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం బాధాకరమని ఆయన అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వం నుండి సహాయ ,సహకారాలు అందక పోయినప్పటికీ, తెలంగాణ అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిచిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news