అవినీతికి ఆధారాలు చూపించు పవన్ : మంత్రి కొట్టు సత్యనారాయణ

-

జనసేన అధ్యక్షుడు, టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ పై మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఇళ్ల స్థలాల్లో 35 వేల కోట్లు స్కాం జరిగిందని పవన్ కళ్యాణ్ ఆధారాలు చూపించగలడా అని తీవ్రంగా మండిపడ్డారు. ఒకవేళ నరేంద్ర మోడీ 35 వేల కోట్లు అవినీతి జరిగిందని పవన్ కళ్యాణ్ ని అడిగితే ఏం చెప్తారని మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు.ఈడీ,సీబీఐ తో విచారణ జరపాలన్న నటుడు పవన్ కళ్యాణ్…..ఇంటర్ పోల్ ను మర్చిపోయాడని అన్నారు.

దేశంలో 31 లక్షల ప్రజలకు ఎక్కడ లేని విధంగా ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వాన్నిది అని ఆయన అన్నారు. జనసేన పార్టీలో మీ నాయకులు గెలుస్తారో లేదో ముందు చూడకుండా చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నావ్ అని అన్నారు. కాపులు నాకు ఓట్లు వేయలేదు అని అంటున్నావ్ మరి నీకు ఎవరు ఓట్లు వేశారంటూ పవన్ను మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు హయంలో అమరావతి భూముల స్కాం, స్కిల్ స్కాం,ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం అన్ని స్కాములే అంటూ విమర్శించారు. ఈ స్కామ్లలో పవన్ కు కూడా వాటా ఉందని ఆయన ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news