ఇదెక్కడి న్యాయం రా బాయ్…వీహెచ్

-

కాంగ్రెస్ సీనియర్‌ నేత వీ హనుమంత రావ్‌… ఆర్టీసీ బస్సుపై అతికించి ఉన్న తెరాస అధినేత కేసీఆర్  పోస్టర్లను చించేశారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నాసందర్భంగా ప్రభుత్వం ప్రచార పోస్టర్లను తొలిగించకపోవటంతో వీహెచ్‌ ఆగ్రహానికి గురయ్యారు. ఈసీ నిబంధనల మేరకు అందరం నడుచుకోవాలని సూచించారు. నాచారంలో ఆర్‌టీసీ బస్సుపై ఉన్న కేసీఆర్‌ ప్రచార పోస్టర్లను చింపేశారు. ప్రయాణికులందరూ సహకరించాలని ఆయన విజ్ణప్తి చేశారు. అరే ఇదెక్కడి న్యాయం ర బయ్ అంటూ వీహెచ్ తనదైన శైలిలో విమర్శిస్తూ…కేసీఆర్ పోస్టర్ని తొలగించారు.

Read more RELATED
Recommended to you

Latest news