ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ!

-

కేంద్ర ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం మీడియా సమావేశాన్ని నిర్వహించనుంది.  ఈ సందర్భంగా మొత్తం  ఐదు రాష్ట్రాలకు చెందిన ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలతోపాటు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా నేడు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.  అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత ముందస్తు ఎన్నికల ఏర్పాట్లపై పలు దఫాలుగా ఎన్నికల సంఘం కసరత్తు చేపట్టిన విషయం తెలిసిందే.  తెలంగాణకు సీఈసీ సాంకేతిక నిపుణులు వచ్చి తెలంగాణలో ఓటర్ల జాబితా రూపొందించే విషయంలో సాంకేతిక సమస్యలను పరిశీలించి.. ఈ నెల 8 న ఓటర్ల తుది జాబితా విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. దీంతో తెలంగాణలో త్వరలోనే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news