ఎమ్మెల్సీ కవిత సోషల్‌ మీడియా అకౌంట్స్‌ హ్యాక్‌..!

-

సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు.తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను హ్యాక్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌(ట్విట్టర్‌) హ్యాక్‌కు చేశారని ఆమె తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పలుసార్లు హ్యాకింగ్‌కు పాల్పడి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి సంబంధంలేని వీడియోను పోస్ట్‌ చేశారని ఆమె తెలిపారు. వెంటనే గుర్తించి సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్లు ట్విట్టర్(ఎక్స్) ద్వారా డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు.సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

 

ఇదిలా ఉండగా.. ఈరోజు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ట్విట్టర్(ఎక్స్) అకౌంట్‌ సైతం హ్యాకింగ్‌ చేసిన విషయం తెలిసిందే. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news