ఎమ్మెల్సీ రాములునాయక్ సంచలన ఆరోపణలు..

-

తనను హత్య చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని తెరాస బహిష్కృత నేత , ఎమ్మెల్సీ రాములు నాయక్ పేర్కొన్నారు. తెరాస పార్టీ కి చెందిన వారు రోడ్డు ప్రమాదం రూపంలోగాని, మరో ప్లాన్‌తో హతమారుస్తారని ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ను రాములు కలిశారు. పార్టీ మారినందుకు ఛైర్మన్ జారీ చేసిన నోటీసులపై వివరణ ఇచ్చారు.  
పార్టీ మారడంపై పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చేందుకు తనకు 4 వారాల గడువు కావాలని కోరానని.. ఛైర్మన్ మాత్రం అవకాశం ఇవ్వడం లేదన్నారు. తాను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా వచ్చానని.. సోషల్ వర్కర్‌గా గుర్తించి తనను మండలికి పంపించారని గుర్తు చేశారు. 

ఏడాది క్రితం నుంచే తనను టార్గెట్ చేశారన్నారు. తనకు ఏ హాని జరిగినా.. ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. తనను ఏదో ఒక కేసులో ఇరికించి.. ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని కుట్ర జరుగుతోందన్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదన్నారు రాములు నాయక్. రిజర్వేషన్లు పెంచాలని వినతిపత్రం మాత్రమే ఇచ్చానన్నారు. అధికార పార్టీ తమకు అనుకూలంగా లేని వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news