ఎర్రగడ్డ దాడి ఘటనలో నిందితుడు అరెస్ట్

-

ఎర్రగడ్డలో కూతురు మాధవి, అల్లుడు సందీప్ ను కత్తితో దాడి చేసిన మనోహరా చారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంఎప్ మక్తాలో బావమర్ది ఇంట్లో తలదాసుకున్న మనోహరాచారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూతురు కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో గత ఐదురోజులుగా మద్యానికి బానిసైన మనోహరాచారి ఈ దాడికి పాల్పడ్డాడు అని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ కు చెందిన సందీప్, బోరబండ వినాయక్ నగర్ కు చెందిన మాధవి గత ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరి ప్రేమ విషయాన్ని తల్లీదండ్రులకు తెలియచేయడంతో .. ఇద్దరి కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ విషయం మరింత ముదరక ముందే మాధవికి తన మేనభావతో వివాహం చేయాలని కుటుంబ సభ్యులు నిశ్చయించారు. దీంతో ఇంటి నుం  చి బయటకు వచ్చేసిన మాధవి సందీప్ ని పదిరోజు క్రితం అల్వాల్ లోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకుంది. పెళ్లి విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు మొదట వ్యతిరేకించి ఆ తర్వాత నెమ్మదిగా ఒప్పుకున్నట్లు నటించారు. అప్పటి నుంచి మాధవి తన భర్త సందీప్ ఇంట్లోనో ఉంటుంది.

ఈ విషయాన్ని తట్టుకోలేని మాధవి తండ్రి రెండు రోజులుగా మాధవికి కలుస్తూ ప్రేమగా నటించారు. తండ్రి నూతన వస్త్రాలు కొనిస్తానని  చెప్పగా గుడ్డిగా నమ్మిన యువ జంట ఎర్రగడ్డలోని హోండా షోరూం దగ్గరకు వచ్చారు. ముందస్తు ప్లాన్ ప్రకారం వారు అక్కడికి చేరుకోగానే సందీప్, మాధవిపై కొబ్బరి బోండాలు నరికే కత్తితో ఆమె తండ్రి మనోహరాచారి దాడి చేశాడు. స్థానికుల సాయంతో నీలిమ ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా మారడంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మాధవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version