ఏపీ సీఎంకి అరుదైన అవార్డు

-

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రతిష్టాత్మక గ్లోబ‌ల్ అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ అవార్డు దక్కింది. ఈ అవార్డుని డాక్టర్ స్వామినాథన్‌ కమిటీ చంద్రబాబుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, చంద్రబాబుకు అందజేయనున్నారు. వ్యవసాయ విధానం, రైతులకు ప్రోత్సాహాలు, పరిశోధన, పంటల అభివృద్ధి, నాయకత్వం వంటి అంశాలను కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న సాగునీరు, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ వంటి అంశాలను కూడా కమిటీ పరిగణలోకి తీసుకుంది. ఈనెల 24న ఢిల్లీలో చంద్రబాబుకు అవార్డు అందజేయనున్నారు

Read more RELATED
Recommended to you

Latest news