జేసీ సోద‌రుల‌పై చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేసిన భ‌క్తులు

-

అమరావతి: అనంతపురం జిల్లాలో తాడిపత్రి ప్రబోధానంద, జేసీ సోదరులకు మధ్య జరుగుతున్న ఘర్షణ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. ప్రబోధానంద మద్దతుదారులు జేసీ సోదరుల అకృత్యాలపై ఫిర్యాదు చేసేందుకు సోమ‌వారం సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. జేసీ సోదరుల చర్యల కారణంగా తామంతా భయాందోళనకు గురి అవుతున్నామని వారంతా వాపోయారు. ఆశ్రమంలోని భక్తులను బలవంతంగా ఖాళీ చేయిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతిఘటించినందుకు తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. తమకు జేసీ సోదరుల నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని సీఎంను కోరేందుకు ఆయన నివాసానికి వచ్చినట్టు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news