ఓటుకు నోటు కేసు విచారణ ఏప్రిల్ కు వాయిదా…

-

Delhi : ఓటుకు నోటు కేసు విచారణను ఏప్రిల్ కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్రపై నిగ్గుతేల్చాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై జస్టిస్ ఎస్వీ ఎన్ బట్టి,జస్టిస్ ఎం ఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అయితే తమకు మరికొంత టైమ్ కావాలంటూ ప్రతివాది రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. దీంతో కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news