‘గుంటూరు కారం’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

-

త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా జనవరి 12న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అతడు, ఖలేజ లాంటి కల్ట్ చిత్రాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ,త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడోసారి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు కారం టికెట్ ధరని రూ. 50 వరకు ఈ నెల 12 నుంచి 21 వరకు టికెట్ల రేట్ పెంచుకునే అవకాశం కలిపిస్తూ అధికారికంగా జీవో కూడా విడుదల చేసింది. ఇక ఇటీవల రిలీజ్ అయినటువంటి ప్రభాస్ సలార్ చిత్రం కంటే ఇది ఎక్కువ మొత్తం. సలార్ చిత్రానికి 40 రూపాయలు పెంచుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిగా ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news