కరీంనగ్ సభకు అమిత్ షా!

-

భాజపా ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లో బుధవారం నిర్వహించనున్న బహిరంగ సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు రానున్నారు. రాష్ట్రంలోని భాజపా నేతలో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల్లో లక్ష్యం సాధించే విధంగా వ్యూహరచన చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి మీడియాతో మాట్లాడుతూ…  హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన బూత్‌ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు నాయకులతో సమావేశమై మార్గదర్శనం చేస్తారని పేర్కొన్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news