మెకానిక్ ని ఢీకొన్న మహేందర్ రెడ్డి కాన్వాయ్

-

తాజా మాజీ రవాణా మంత్రి, తెరాస నేత పట్నం మహేందర్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని మెకానిక్ మృతి  చెందారు.  తాండూరులో జరిగిన ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని హైదరాబాద్ కి తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్‌లోని పైలట్ వాహనం వేగంగా వెళ్తున్న సమయంలో ఎంకలపల్లి గేట్ వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ మహిపాల్ రెడ్డి అనే మెకానిక్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదానికి కారణమైన కానిస్టేబుల్ శ్రీనివాస్ పై  కేసు నమోదు చేసి వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news