కాంగ్రెస్ టు కాంగ్రెస్ వయా భాజపా

-

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి రాజకీయ వ్యవహారం గురువారం హాట్ టాపిక్ గా మారింది.  ఉదయం భాజపా ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో భాజాపా చేనిన ఆమె సాయంత్రానికి మనసు మార్చుకుని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. భాజపాలో చేరిన కొద్దిగంటల్లోనే ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తాను భాజపాలో చేరడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారిని దీంతో తన సొంత పార్టీలోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news