గుంటూరు కారం ఫస్ట్ డే 3 వేల షోలు.. 12 లక్షల టికెట్లు

-

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రంలో శ్రీ లీల ,మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటిస్తున్నారు.ఈ సినిమా జనవరి 12వ తేదీన థియేటర్లలోకి వస్తుండటం.. అర్థరాత్రి ఒంటి గంట నుంచే షోలు వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో 12వ తేదీ ఫస్ట్ డే.. ఏకంగా 3 వేల షోలు పడుతుండగా అందులో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 13 వందల షోలు, బెంగళూరులో అయితే 538 షోలు,వైజాగ్ లో 257 షోలు, విజయవాడలో 176 షోలు, గుంటూరులో 125 షోలు, వరంగల్ లో 70 షోలు, ఖమ్మంలో 25 షోలు, కాకినాడలో 47 షోలు, తిరుపతిలో 56 షోలు, నెల్లూరులో 68 షోలు పడుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే గుంటూరు కారం సినిమా ఫస్ట్ డే లో 12 లక్షల టికెట్ల అమ్మకం ద్వారా.. మొదటి రోజే 26 కోట్ల రూపాయలు రానున్నాయి. తెలుగు సినీ హిస్టరీలో ఇది ఓ రికార్డ్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు.తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి స్కీన్ పై గుంటూరు కారం పడుతుంది. అన్ని థియేటర్లలో ఇదే మూవీ ఉండటంతో టికెట్లు ఈజీగానే దొరుకుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news