గుండెలపై కేటీఆర్ చిత్రపటంతో రోహిత్ రెడ్డి

-

రోహిత్ రెడ్డిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న కేటీఆర్

తెరాస ప్రభుత్వంపై అభిమానంతో తెరాస విజయాన్ని ఆకాంక్షిస్తూ 17 రోజుగా విజయవాడ నుంచి పాదయాత్ర చేస్తూ ఆదివారం హైదరాబాద్ కు చేరుకున్న నెల్లూరు జిల్లాకు చెందిన రోహిత్ రెడ్డి అనే యువకుడిని మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించి స్వాగతం పలికారు. తెరాస యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డిలు ఆయువకుడిని కేటీఆర్ వద్దకు తీసుకొచ్చారు. గుండెల నిండా అభిమానం నింపుకుని వచ్చిన రోహిత్ని కేటీఆర్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని పలుకరించారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న అనేక పథకాలను కొనియాడాడు. యువతరానికి స్ఫూర్తినిచ్చేలా కేటీఆర్ ముందుకు సాగుతున్నారని ఇందుకుగాను కేటీఆర్ చిత్రాన్ని తన గుండెలపై టాటూ వేయించుకుని అభిమానం చాటాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version