జగన్ కంచుకోటలో ‘ధర్మ పోరాట’దీక్ష

-

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి కంచుకోటలాంటి కడప జిల్లాలో తెదేపా ‘ధర్మ పోరాట’ దీక్షను మంగళవారం చేపట్టనుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. విభజన హామీలను అమలు కోసం తెదేపా చేపట్టిన ఈ దీక్షకు సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, దేవినేని, సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి హజరుకానున్నట్లు సమాచారం. విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై  దాడి అనంతరం జిల్లాలో చేపట్టనున్న ధర్మ పోరాట దీక్షకు కట్టు దిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.  ఈ సభలో సీఎం చంద్రబాబు కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పై విధాన ప్రకటన చేస్తారని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news