ఇటీవల మానవ అక్రమరవాణా కేసులో అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17న జిల్లా కేంద్రం సంగారెడ్డిలో నిర్వహించిన ర్యాలీలో జగ్గారెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ను దూషించడంతో పాటు, ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించి అనేక వాగ్దానాలు చేశారని తెరాస కార్యకర్తలు ఎన్నికల అధికారులకు వివరించారు. ఫిర్యాదును పరిశీలించిన సంగారెడ్డి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ శ్రీను 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసు జారీ చేశారు. ‘నాకు ఊచ లు చూపించిన కేసీఆర్.. నీకు చుక్క లు చూపిస్తా’ అంటూ జగ్గారెడ్డి వ్యా ఖ్యానించినట్లు ఫిర్యాదులో పేర్కొ న్నారు. నియోజకవర్గంలో 40 వేల మందికి ఇళ్ల పట్టాలు అందిస్తానని, కార్యకర్తలకు ఆర్థిక సాయం చేసేందుకు ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేస్తానని జగ్గారెడ్డి వాగ్దానం చేయడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జగ్గారెడ్డికి ఈసీ నోటీసులు
-
Previous article
Read more RELATEDRecommended to you
నా సోదరుడు ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడరు :ప్రియాంక గాంధీ
లోక్సభలో చేసిన తొలి ప్రసంగంలోనే రాహుల్ గాంధీ హిందువులను కించపరచేలా వ్యాఖ్యలు...
Ganesh -
T 20 :టీమిండియా జింబాబ్వే టూర్ షెడ్యూల్ ఇదే !
5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం టీమిండియా జింబాబ్వేలో పర్యటించనుంది.ఈ పర్యటన...
Ganesh -
ఆ పిటిషన్ను కొట్టివేయడం కేసీఆర్కు చెంప పెట్టులాంటింది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు కోసం హైకోర్టుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి...
Ganesh -