కూటమిలో కాస్త ఇబ్బంది ఉన్నా..గెలుపే ముఖ్యం.. కోదండరాం

-

తెరాస పార్టీని తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..వారి వ్యతిరేకతే మామ్మల్ని గెలిపిస్తుందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. నాగోల్‌లోని బండ్లగూడలో జరిగిన ఓ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…  ఈ ఎన్నికలు కేసీఆర్‌ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న సమరమని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ నిరంకుశ పాలన మళ్లీ రాకుండా చూడాలని ప్రజాస్వామికవాదులంతా బలంగా కోరుకుంటున్నారన్నారు. కూటమిలో సీట్ల సర్దుబాటు గురించి కాస్త ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది, అయినప్పటికీ తెరాస ఓటమి ప్రధాన లక్ష్యంగా తాము సర్దుకుని పోతామని కోదండరాం పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news