టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా….

-

అఫ్గానిస్థాన్తో మూడో టీ20లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నారు.తొలి రెండు t 20 మ్యాచ్‌లలో మొదట బౌలింగ్‌ చేశాం కాబట్టి.. ఈసారి బ్యాటింగ్‌ ఎంచుకుంటున్నట్లు కెప్టెన్‌ హిట్ మ్యాన్ పేర్కొన్నారు. ఈ మ్యాచ్లో శాంసన్, కుల్దీప్, అవేశ్ ఖాన్ రీఎంట్రీ ఇచ్చారు.

కాగా… టీ20 ప్రపంచకప్‌-2024కు ముందు టీం ఇండియా ఆడుతున్న ఆఖరి టీ20 సిరీస్‌ ఇది. సొంతగడ్డపై.. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన రోహిత్‌ సేన. అఫ్గన్‌తో మూడో టీ20లోనూ గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయాలని చూస్తుంది.

భారత్: రోహిత్(కెప్టెన్), జైస్వాల్, కోహ్లి, శాంసన్(వికెట్ కీపర్), దూబే, బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, రింకూసింగ్, సుందర్,అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

అఫ్గానిస్థాన్: గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం (కెప్టెన్), గుల్బాదిన్, జనత్, అష్రఫ్, కైస్ అహ్మద్, ఒమర్జాయ్, నబీ, నజీబుల్లా జద్రాన్,సఫీ, మలీద్.

Read more RELATED
Recommended to you

Latest news