డీఎస్ తో పీసీసీ చీఫ్ భేటీ

-

తెరాస రాజ్యసభ సభ్యుడు సీనియర్ నేత డి.శ్రీనివాస్ (డీఎస్)ను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్ది సేపటి క్రితం కలిశారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లిన ఉత్తమ్ అంతకు ముందు డీఎస్ తో సమావేశమైయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు అరగంట పైగా చర్చ జరిగింది. ప్రధానంగా డీఎస్ ని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఉత్తమ్ ఆహ్వానించారు. ఇందుకు గాను రాహుల్ సమక్షంలో పార్టీలో చేరేందుకు  రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సానుకూలంగా స్పందించిన డీఎస్ త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సమాచారం.

గత కొద్ది నెలలుగా తెరాస కార్యక్రమాలకి డీఎస్ దూరంగా ఉండటంతో పాటు తన కుమారుడు భాజపాలో కొనసాగడం జిల్లాలో తెరాస పార్టీకి నష్టం కలుగుతుందని ఇప్పటికే తెరాస నాయకులు కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు.  దీనిపై స్పందించిన డీఎస్ తాను తెరాసకు రాజీనామా చేయనని కావాలంటే నన్ను డిస్మిస్ చేయండి అంటూ కేసీఆర్ ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news