ఢిల్లీ ఎయిమ్స్ లో చేరనున్న సీఎం!

-

గోవా సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్యం మరింత క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు మార్లు అమెరికాలో చికిత్స చేయించుకున్న పారికర్ ఆశించిన మేరకు కోలుకోక పోవడంతో తాను సీఎంగా కొనసాగలేనని అధిష్టానానికి తెలియజేశారు. ఈ విషయమై శుక్రవారం భాజపా అధ్యక్షుడు అమిత్ షా తో పారికర్ భేటీ అయినట్లు తెలుస్తోంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్న సీఎం పారికర్ క్యాన్సర్ నుంచి విముక్తి పొందలేకపోయారు. దీంతో సీఎం పదవికి తాను సరైన న్యాయం చేయలేకపోతున్నాని అధిష్టానానికి వెల్లడించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version