తెలంగాణలో పర్యటించనున్న సోనియా గాంధీ!

-

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమె గజ్వేల్ లేదా సూర్యాపేటలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ నెల 23 లేదా 30 న రాష్ట్రంలో సోనియా పర్యటించనున్నారు.  తెలంగాణ ఇచ్చిన  పార్టీగా రాష్ట్ర ప్రజలకు ఆమె వివరించనున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లపై పార్టీ సీనియర్ నేతలతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  చర్చలు జరుపుతున్నారు.

పార్టీ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చిన కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించి పొత్తుల పార్టీలకు కేటాయించాల్సిన సీట్ల గురించి త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news