తెలంగాణ ‘జాతిపిత’ ని విమర్శించే స్థాయి నీకు లేదు..బాల్క సుమన్

-

తప్పులు ఒప్పుకుని తెలంగాణ ప్రజలను క్షమాపణ అడుగు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్‌రెడ్డి ఏమీ తెలియని స్వాతిముత్యంలా మాట్లాడం హాస్యాస్పదంగా ఉందంటూ తెరాస ఎంపీ బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుమన్‌ మాట్లాడుతూ.. ఇకనైనా తెలంగాణ ప్రజలను నువ్వు చేసిన తప్పులకు గాను క్షమాపణ  కోరాలని డిమాండ్ చేశారు. ఇష్టం వచ్చినట్టు నోరు అదుపులో పెట్టుకోకుండా వాగితే.. బయట తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు… ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ.. తెలంగాణ పరువుని బజారుకీడ్చావు.. ‘‘ ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఉంది రేవంత్‌రెడ్డి తీరు. తెలంగాణ కోసం పోరాట చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత ని విమర్శించే స్థాయి నీకు లేదు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version