దళితులు రాజ్యాధికారం సాధించాలి…కత్తి మహేశ్

-

రానున్న ఎన్నికల్లో చిత్తూరు ఎంపీగా పోటీచేసే అవకాశం ఉందని ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ అన్నారు. ఆదివారం ఒంగోలులో దళిత సంఘాల సమావేశంలో మాట్లాడుతూ… దళితులు రాజ్యాధికారం సాధిస్తేనే అన్ని రంగాల్లో ఆశించిన ప్రగతిని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని అంటున్నారని, ఈ కుట్రకు సంబంధించిన ఆధారాలను ఆయన బయటపెట్టాలన్నారు.  2019 ఎన్నికల్లో దళితులు కీలక పాత్ర పోషించనున్నారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచిన  రాజకీయంగా ఇంకా దళితులు వెనుక బడేఉన్నారని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన  ప్రణయ్ హత్య కులదురహంకార హత్య అని అభివర్ణించారు.

Read more RELATED
Recommended to you

Latest news