చరణ్ సినిమాతో కొత్త టర్న్

-

రంగస్థలం తర్వాత రాం చరణ్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు స్టేట్ రౌడీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతుంది. 2019 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.

నటుడిగా, సీరియల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న రాజీవ్ కనకాల డిస్ట్రిబ్యూటర్ గా కొత్త టర్న్ తీసుకోనున్నాడు. అందుకే రాం చరణ్ సినిమాతో ఆ ప్రయత్నం మొదలు పెట్టాడు. రంగస్థలం సినిమా ఓవర్సీస్ లో వసూళ్ల హంగామా సృష్టించింది. దాదాపు 24 కోట్ల దాకా అక్కడే రాబట్టింది. అందుకే రాం చరణ్ స్టేట్ రౌడీ సినిమాను 13-15 కోట్ల దాకా కోట్ చేస్తున్నారట.

బోయపాటి సినిమాలకు అక్కడ మంచి డిమాండ్ ఉండటంతో నిర్మాతలు చెప్పిన రేటుకి కనకాల రాజీవ్ ఓకే అన్నాడట. మరి డిస్ట్రిబ్యూటర్ గా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన రాజీవ్ మొదటి ప్రయత్నంగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news