నగరంలో భారీ ట్రాఫిక్ జామ్

-

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విగ్రహాల కోసం వందలాది భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించాయి. వాహనదారులు, ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో  రోడ్లపై వాహనాలు నత్తనడక నడుస్తున్నాయి. బుధవారం అర్థరాత్రి నుంచి నగరంలోకి వాహనాలు ప్రవేశించడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి.

ఎల్బీనగర్ నుంచి కోఠి వరకు, ఉప్పల్ నుంచి సికింద్రాబాద్, కూకట్ పల్లి, మెహదీపట్నం మార్గాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి దాదాపు లక్షల విగ్రహాలను ఇతర ప్రాంతాలకు తరలించడంతో పాటు, భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలకు ఆయా ప్రాంతాల ప్రజలు భారీ ఏర్పాట్లను చేయడంతో ప్రయాణికులకు కాస్త ఇబ్బందులు తప్పవు.

Read more RELATED
Recommended to you

Latest news