నయవంచనకు మారు పేరు.. కాంగ్రెస్‌ : కేటీఆర్‌

-

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోసం కాంగ్రెస్ నైజం అని ,నయవంచనకు నిలువెత్తు రూపం.. కాంగ్రెస్ అని ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా ఆరోపించారు. అందుకే ఇండియా కూటమి నుండి టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు బయటకు వచ్చాయి అని అన్నారు.మిత్రపక్షాలను ఒప్పించలేని వారు ,దేశ ప్రజలను ఏం మెప్పిస్తారని కేటీఆర్‌ ప్రశ్నించారు. మోడీని, బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని ఎద్దేవ చేశారు. ఇండియా కూటమికి అంతకన్నా లేదని ఆయన పేర్కొన్నారు. ఇక దేశప్రజలు ప్రాంతీయ పార్టీల నాయకుల వైపే మొగ్గు చూపుతున్నారు అని ఆయన అన్నారు.

తెలంగాణలో కేసీఆర్ అయినా.. పంజాబ్, ఢిల్లీలో కేజ్రీవాల్ అయినా…బెంగాల్‌లో మమతా దీదీ అయినా.. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేది.. రాష్ట్రాల్లో బలమైన పార్టీలే అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కథ ఖతం అని , కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో.. ప్రాంతీయ శక్తుల పాత్రే కీలకమని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news