పోరాటానికి సిద్ధంగా ఉండండి…చంద్రబాబు

-


కేంద్రం పై పోరాటానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు కోరారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ… తాను గతంలో ఎన్నిసార్లు కడపకు వచ్చినా ఇంత ఆదరణ లభించలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతిలో వెంకన్న సాక్షిగా మోడీ ఇచ్చిన హామీలను వీడియో సాయంతో మరో సారి ప్రజలకు చూయించారు. మోదీ ఏపీ ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి చేసింది ముమ్మాటికీ నమ్మకద్రోహమే అన్నారు. గతంలో వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ అందరూ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. గత ప్రధాని ఇచ్చిన హామీని ఇప్పటి ప్రధాని నెరవేర్చాల్సిన బాధ్యత ఉందా లేదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ కేంద్రంనుంచి నిధులు రావడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అవిశ్వాసం తర్వాత కేంద్రంలో భాజపాను నమ్మేస్థితిలో ఎవ్వరూ లేరన్నారు. నాటి నుంచి వారి గ్రాఫ్ తగ్గతూ వస్తోందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version