ఫిబ్రవరి 3న ఓటీటీలోకి రానున్న ‘సైంధవ్’

-

హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ నటించిన తాజా చిత్రం సైంధవ్‌ . ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కింది.వెంకటేష్‌ నటించిన 75వ చిత్రనికి వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. ఆయన కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో భారీ యాక్షన్‌ హంగులతో నిర్మించారు. ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు, టీజ‌ర్ రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, హిందీ మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అయింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోని ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఈ చిత్రం ఓటిటి హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ తేదీ కన్ఫర్మ్ అయింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్లో ‘సైంధవ్’ స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి బరిలో నిలిచిన ‘సైంధవ్’ ప్రేక్షకులను మెప్పించలేక కేవలం 3 వారాల్లోనే ఓటీటీలోకి రాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news