బాలయ్య.. మజాకానా.. కర్నూల్ లో వీరసింహారెడ్డి రికార్డ్

-

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా నటించిన చిత్రం వీర సింహ రెడ్డి. ఈ చిత్రంలో శృతిహాసన్ బాలకృష్ణ సరసన హీరోయిన్గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందించాడు.

గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైనటువంటి వీర సింహారెడ్డి భారీ విజయాన్ని సాధించింది. సాధారణంగా ఏ సినిమాలు అయినా ఈ రోజులలో నెలకు మించి థియేటర్లలో ఆడడం లేదు. పెద్ద సినిమాలు,హిట్టు సాధించిన సినిమాలకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కానీ దీనికి భిన్నంగా వీర సింహారెడ్డి సినిమా కర్నూల్ లో 365 డేస్ థియేటర్లో రన్ రికార్డు సృష్టించింది. సంవత్సరం మొత్తం నాలుగు షో లతో ఈ సినిమా థియేటర్లలో నడిచిందని మేకర్స్ ప్రకటించారు.

 

 

ఈ 365 పోస్టర్ను తమన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వీర సింహారెడ్డి ఫైర్ అంటూ రాసుకోచ్చాడు. దీంతో అభిమానులు బాలకృష్ణ మజాకా అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ బాబి తో బాలకృష్ణ ఓ సినిమాలో నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news