మహారాష్ట్ర సీఎం తో రామ్ చరణ్ దంపతులు….. వైరల్ అవుతున్న ఫోటోలు

-

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కొణిదెల భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంది. సీఎం షిండే ,మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఆతిథ్యానికి రామ్ చరణ్ దంపతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అంటూ రాస్కొచ్చింది.

 

ఇటీవలే షూటింగులకి గ్యాప్ ఇచ్చి ముంబైలోని మహాలక్ష్మి ఆలయం సందర్శించిన సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఇంటికి వెళ్లి వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ క్రమంలో ఇరువురు దంపతులు సీఎం షిండే కి పుష్పగుచ్చం ఇస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నటువంటి గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలలు ఉన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రం నుంచి విడుదలైనటువంటి పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గతంలో ఈ చిత్రం నుంచి దీపావళికి

Read more RELATED
Recommended to you

Latest news