మాజీ మంత్రి కన్నుమూత

-


మాజీ మంత్రి మల్యాల రాజయ్య అనారోగ్యంలో సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. నాడు ఎన్టీఆర్‌ పిలుపుతో తెదేపాలో చేరిన రాజయ్య 1985 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీచేసి అందోల్‌ నియోజకవర్గంలో రాజనర్సింహపై గెలుపొందారు. ఆ తర్వాత1997లో సిద్దిపేట ఎంపీగా విజయం సాధించి ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో గృహ నిర్మాణ, ఆర్థిక శాఖ మంత్రిగానూ సేవలందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version