మిర్యాలగూడ: ప్రణయ్ హత్య కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్

-

మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన‌ పరువు హత్యకేసులో మిర్యాలగూడ పట్టణ  కాంగ్రెస్ అధ్యక్షుడు కరీంను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రణయ్ భార్య అమృత తండ్రి మారుతీరావు, అతడి తండ్రి శ్రావణ్ కుమార్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కూతురు ప్రేమ వివాహం చేసుకుందనే కక్షతోనే ప్రణయ్ ని మారుతీరావు హత్య చేయించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నయీం ముఠా, పాత బస్తీకి చెందిన పలువురు నేరస్తులతో కరీంకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇతర కులానికి చెందిన వాడిని పెళ్లి చేసుకుందనే కారణంతోనే అన్నింటికి సిద్ధపడే ప్రణయ్ ని హత్య చేయించినట్లు మారుతీరావు వెల్లడించడంతో మిర్యాలగూడ పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేడు సాయంత్ర జరగనున్న ప్రణయ్ అంత్యక్రియలకు ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news