మూడో రోజు గాయత్రి దేవిగా..బెజవాడ దుర్గమ్మ

-

దసర శరన్నవరాత్రి  ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కొలువై ఉన్న దుర్గమ్మవారు మూడోరోజు గాయత్రి రూపంలో  భక్తులకు దర్శనమిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు. ఉత్సవాల్లో భాగంగా  వృద్ధులు, వికలాంగుల కోసం దుర్గ ఘాట్‌ వద్ద ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌, కృష్ణవేణి ఘాట్ల వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఇతర వివరాలకు అధికారులు 18004259099 టోల్‌ ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు. ఏదైన అవాంఛనీయ సంఘటన జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు 7328909090 ఈ నంబరుకు వాట్సాప్ చేసి ఫిర్యాదు చేయొచ్చు

శ్రీశైలం భ్రమరాంభ దేవి, బాసర సరస్వతి అమ్మవారు చంద్రఘంట అలంకారంలో దర్శమిస్తుండగా, వరంగల్ భద్రకాళి అమ్మవారు గాయత్రి మాతగా భక్తులకు దర్శనమిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news