రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హనుమాన్‌ టీమ్‌.. 14 లక్షలు అందజేత

-

రాముడికి ఇచ్చిన మాటను హనుమాన్ మూవీ టీమ్‌ నిలబెట్టుకుంది. చెప్పినట్టుగానే హనుమాన్‌ మూవీ వసూళ్లలో కొంత మొత్తాన్ని అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చింది. నిన్న ప్రదర్శించిన హనుమాన్ సినిమా ప్రీమియర్‌ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.14.25 లక్షలను విరాళంగా అందించింది.

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన హనుమాన్‌ మూవీ ఇవాళ (జనవరి 12న) రిలీజ్ అయింది. ముందు నుంచి ఈ మూవీకు వచ్చిన హైప్‌ దృష్ట్యా.. సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు అంటే.. జనవరి 11న భారీగా ప్రీమియర్‌ షోలు వేశారు. దాదాపు 300 థియేటర్లలో మూవీను ప్రదర్శించారు. అయితే హనుమాన్‌ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సమయంలో చిత్ర బృందం తమ మూవీకు అమ్ముడుపోయే ప్రతి టికెట్‌లో 5 రూపాయలను అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు అన్నమాట ప్రకారం.. నిన్న ప్రీమియర్‌ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.14.25 లక్షలను అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చింది. ఈ మూవీ థియోటర్ లో ప్రదర్శితమైనన్ని రోజులు కూడా అమ్ముడుపోయే ప్రతి టికెట్‌పై రూ.5ను విరాళంగా ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Latest news