లేడీస్ కోసం ‘గుంటూరు కారం’ స్పెషల్ షో.. ఎప్పుడంటే.?

-

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేశ్‌బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం గుంటూరు కారం .అత‌డు, ఖ‌లేజా లాంటి కల్ట్ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో అంచ‌నాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా విడుదల ముందు లేడి ఫ్యాన్స్‌కు మ‌హేష్ భార్య నమ్రత శిరోద్కర్ గుడ్ న్యూస్ అందించారు.

ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే గుంటూరు కారం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూడాలనుకునే లేడి ఫ్యాన్స్ కోసం నమ్రత శిరోద్కర్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ గాంధీనగర్‌లోని రాజ్ థియేటర్‌లో కేవ‌ళం మ‌హిళ‌ల‌ కోసం గుంటూరు కారం జ‌న‌వ‌రి 12న‌ స్పెష‌ల్ స్క్రీనింగ్ ఉండ‌బోతుంది. మ‌హేష్ లేడీ ఫ్యాన్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అంటూ నమ్రత ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news