వాహనదారులకు భారీ షాక్… ఆ రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

-

కర్ణాటక లో సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వాహనదారులకు భారీ షాకిచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర పరిధిలోని సేల్స్‌ ట్యాక్స్‌ను రూ.3 మేర పెంచింది.ఈ పెంపు తక్షణమే (జూన్‌ 15 నుంచే) అమల్లోకి వస్తుందని కర్నాటక ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు శనివారం నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది.

పెట్రోల్‌పై కర్ణాటక సేల్స్‌ ట్యాక్స్‌ ను 25.92శాతం నుంచి 29.84శాతము, డీజిల్‌పై అమ్మకం పన్నును 14.3 శాతం నుంచి 18.44 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తాజా పెంపుతో రాష్ట్రంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.3, డీజిల్‌ ధర రూ.3.05 మేర పెరుగుతున్నట్లు కర్ణాటక పెట్రోలియం డీలర్స్‌ అసిసోయేషిన్‌ వెల్లడించింది. ఇక ప్రస్తుతం బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.86, డీజిల్‌ ధర రూ.88.94కు చేరింది. ఈ పెంపుతో రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.2,500-2,800 కోట్ల మేర ఆదాయం సమకూరనున్నట్లు కర్ణాటక ఆర్థికశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news