ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కుమార స్వామి

-

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున పోటీలో నిలిచిన జేడీ(ఎస్) నేత కుమార స్వామి ఎంపీగా గెలిచారు. దీంతో ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో మంత్రి పదవి దక్కింది.దీంతో ఆయన ఈ రోజు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

 

కుమార స్వామి పార్లమెంట్ ఎన్నికల్లో మాండ్యా నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆయనకు మోడీ కేబినెట్ లో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ దక్కింది. కర్ణాటక రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన మూడో సారి ఎంపీగా గెలిచి కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో త్వరలో రామనగర అసెంబ్లీకి బై ఎలక్షన్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news