కేసీఆర్ ఆచూకీ తెలిసిన వారికి తగిన బహుమానం..గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు

-

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడటం లేదంటూ గజ్వేల్లో పలుచోట్ల పోస్టర్స్ వెలిశాయి. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఇందిరా పార్క్ చౌరస్తా, బస్టాప్, అంబేద్కర్ చౌరస్తా, మున్సిపల్ ఆఫీస్ వద్ద వాల్ పోస్టర్లు అంటించారు.’వరుసగా మూడుసార్లు గెలిచి కేసీఆర్ మా నియోజకవర్గానికి రాలేదు. సారు కారు పదహారు అని ఎక్కడ పరారు అయ్యాడో ఎలా ఉన్నాడో తెలియడం లేదు అని, గజ్వేల్ ప్రజలు ఇక్కడ..! కేసీఆర్ ఎక్కడ?’ నినాదాలతో ర్యాలీ చేపట్టారు. ఆయన ఆచూకీ తెలిసిన వారికి తగిన బహుమానం ఇస్తామని గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ప్రకటించారు.

కాగా, ఇటీవల జరిగిన తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర కనీసం ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది.కాంగ్రెస్‌, బీజేపీకు చెరో 8 స్థానాలు రాగా,పోటీ చేసిన ఒక్క స్థానాన్ని ఎంఐఎం (అసదుద్దీన్‌ ఒవైసీ) నిలబెట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news