శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..

-

ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలకు ముందురోజు అనగా బుధవారం రాత్రి 7-8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణగా పరిగణిస్తారు.  స్వామి వారి ఆశీస్సులు ఉండాలని సంకల్పిస్తూ.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ అంకురార్పణ ఘట్టాన్ని వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో కె.ఎస్ శ్రీనివాస రాజు ఇతర ఆలాయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం తరుఫున గురువారం  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version