సరిపోదా శనివారం’ చిత్రం ఓటీటీ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ దిగ్గజం…?

-

నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ . ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఎస్‍జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.నాని,వివేక్ కాంబినేషన్‍లో వచ్చిన ‘అంటే సుందరానికి’ మూవీ కమర్షియల్‍గా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా.. మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు సమాచారం. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‍ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఏకంగా నాని కెరీర్లో అత్యధిక ఓటీటీ డీల్‍గా రూ.45కోట్లను వెచ్చించి అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‍లో తెలుగుతో , హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడలోనూ తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news