సీఎం రేవంత్‌ రెడ్డి నివాసానికి వైఎస్‌ షర్మిల…..

-

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైఎస్‌ షర్మిల హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శనివారం కలిశారు.సీఎం నివాసానికి వెళ్లినషర్మిల…. తన తనయుడు వైఎస్‌ రాజారెడ్డి నిశ్చితార్థం, పెళ్లికి రావాలని రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి షర్మిలకు శాలువా కప్పి సత్కరించారు . అనంతరం షర్మిల తన కుమారుడి పెళ్లి పత్రికను సీఎం కి అందించారు.

తన కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి, అట్లూరి ప్రియ పెళ్లికి కుటుంబ సమేతంగా హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వైఎస్ షర్మిల కోరారు. అలాగే నిశ్చితార్థం కార్యక్రమానికి కూడా రావాలని ఆమె ఆహ్వానించారు. కాబోయే వధూవరులకు ముందస్తుగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జనవరి 18 న రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థం కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 17న పెళ్లి జరగనుంది. దీంతో ప్రస్తుతం తనయుడి పెళ్లి పనుల్లో భాగంగా పలువురు ప్రముఖులకు వివాహ ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మొదటి ఆహ్వాన పత్రికను ఉంచి.. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత తాడే పల్లికి వెళ్లి తన సోదరుడు, ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు.

Read more RELATED
Recommended to you

Latest news