సోషల్ మీడియా’కు కాసులు కురిపిస్తున్న ఏజ్ గ్రూప్ ఇదే

-

ఇన్ఫ్రాగామ్,ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకి ప్రధాన ఆదాయ మాధ్యమంగా ఉన్నది మాత్రం యువతే అని అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్న ‘హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ అధ్యయనంలో తేలింది.దీని ప్రకారం.. అమెరికాలోని 18 సంవత్సరం లోపు యూజర్ల ద్వారా సోషల్ మీడియా కంపెనీలకు 2022 సంవత్సరంకు గాను రూ.91,541 కోట్లు, 12 ఏళ్లలోపు పిల్లల వల్ల రూ.17,476 కోట్ల యాడ్స్ ఆదాయం దక్కింది.టిక్ టాక్ ,స్నాప్చాట్, యూట్యూబ్లకు వచ్చే యాడ్స్,రాబడిలో దాదాపు 30 నుంచి 40 శాతం యువ యూజర్ల వ్యూస్ నుంచే వస్తున్నాయని వెల్లడి అయింది.

ఇందులో స్నాప్ చాట్ అత్యధికంగా 41 శాతం, టిక్ టాక్ 35 శాతం, యూట్యూబ్ కు 27 శాతం, ఇన్ఫ్రాగామ్ కు 16 శాతం వచ్చింది. 13-17 ఏళ్ల లోపు యూజర్ల నుంచి వచ్చిన యాడ్స్ ఆదాయంలో మొదటి స్థానంలో నిలిచిన టిక్ టాక్ రూ.16,644 కోట్లు, రెండో స్థానంలో నిలిచిన యూట్యూబ్కు రూ.9,986 కోట్లు వచ్చాయి. 12 సంవత్సరాల లోపు యూజర్ల నుంచి లభించిన యాడ్స్ ఆదాయంలో మొదటి స్థానంలో నిలిచిన యూట్యూబ్ కు రూ.7,983 కోట్లు, రెండో స్థానంలో నిలిచిన ఇన్ఫ్రాగామ్ కు రూ.6,676 కోట్లు, మూడో స్థానంలో నిలిచిన ఫేస్బుక్ కు రూ.1,140 కోట్లు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news